•ధరల పెరుగుదలపై ప్రణబ్
•మారని సర్కారు మొండి వైఖరి
•వాయిదా తీర్మానాలపై చర్చకు ససేమిరా
•గందరగోళం మధ్య ఉభయసభల వాయిదా
నిత్యావసరాల ధరల పెరుగుదలలో ప్రభుత్వ వైఫల్యం ఏ మాత్రం లేదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. బుధవారం లోక్సభలో ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానానికి పట్టుబట్టిన ప్రతిపక్షాల డిమాండ్పై ఆయన జవాబిస్తూ ఈ అంశంపై సమగ్ర చర్చను తాను కూడా ఆహ్వానిస్తున్నానని, అయితే అందులో ప్రభుత్వ వైఫల్యం ఏ మాత్రం లేనందున ఓటింగ్కు అనుమతించబోమని అన్నారు. వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలంటే ముందుగా అది కచ్చితంగా ప్రభుత్వ విధి నిర్వహణకు సంబంధించినదై ఉండాలని ఆయన చెప్పారు. పెట్రో ధరలను పెంచిన ప్రభుత్వం దాని నుంచి 'పైశాచిక ఆనందాన్ని' పొందడం లేదన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఈ ధరలను పెంచాల్సి వచ్చిందని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని, అందులో ప్రభుత్వ వైఫల్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు సంబంధించిన అన్ని అంశాలపైనా నివారణ చర్యలతో కూడిన సమగ్ర చర్చను తాను కూడా ఆహ్వానిస్తున్నానని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రభుత్వం వాటిని తప్పక స్వీకరిస్తుందని చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, అయితే వాయిదా తీర్మానం పరిధిలో దాన్ని చర్చించలేమని ఆయన పునరుద్ఘాటించారు. కాగా ధరాభారంపై ప్రభుత్వం
Page(s):1 2 3